వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపీదేవి వెంకటరమణ వైపీసీ తీర్థం పుచ్చుకోనున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలియవచ్చింది. మోపిదేవి బెయిల్ కోసం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది. ఒక వేళ బెయిల్ రాని పక్షంలో బుధవారం చంచల్‌గూడ జైల్లోనే జగన్ సమక్షంలో మోపిదేవి వైసీపీ ఖండువా వేసుకోనున్నారు.
గురువారంనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో మోపిదేవి భార్య, సోదరుడు, ఆయన వర్గీయులు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా మోపిదేవి వెంకటరమణను అనారోగ్యం కారణంగా మంగళవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మోపిదేవి వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

Tags: Telugu News, Andhra News, News
Labels: ,

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.

Powered by themekiller.com